Difference in Students Numbers శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం Paramanandayya Sishyulu Stories In Telugu

 Difference in Students Numbers శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం Paramanandayya Sishyulu Stories In Telugu

  శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం

పరమానందయ్య శిష్యుల కథలు • Paramanandayya Sishyulu Stories In Telugu

ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు.

“ఆరే నిజంగానా?” అంటూ ఆయన ఆశ్చర్యపోయి, “సరిగ్గా లెక్కపెట్టావా నాయనా! ముందాశోకాలు మాని, ఇంకోసారి లెక్కపెట్టు ధైర్యంగా అన్నారు పరమానందయ్య.

“నిజమేనండీ గురువుగారూ! మేం మీ శిష్యులం పదిమందిమి ఉండాలికదా! మీతో కలిపి 11మందిమి… ‘ఏకాదశరుద్రుల్లా భాసిస్తున్నాం” అని మీరు అంటుంటారు. ఇప్పుడు లెక్కబెడితే దశావతారాలే-మీతో కలిపి” అన్నాడు ఆ శిష్యుడు.

ఆ శిష్యుడు ఎంతో చురకైన వాడని పరమానందయ్యగారి నమ్మకం. అటువంటి వాడి మాటల్లో శంకించడానికేముంటుంది?

అయిన్సా, శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి “మనం ఏకాదశరుద్రుల్లాంటి వారం” అంటూ తనను మినహాయించుకొని లెక్కబెట్టాడాయన కూడా. పదిమందే లెక్క తేల్తున్నారు. దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకర్ని మింగేసిందని భోరుమన్నాడు.

“లెక్కతప్పు వేసుకొంటూ భోరుమంటున్న శిష్యులు”

ఇక్కడ గురుశిష్యులిద్దరూ చేస్తున్న పొరపాటేమిటీ అంటే… ముందుగా తమను తాము లెక్కించుకొని, ఇతరుల్ని లెక్కించుకుంటూ రావాలన్న కసీసజ్ఞానం విస్మరించడం. అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువ వస్తున్నారు.

తీరా, వికల మనస్కులై ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా, ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువు గారితో పాటు అందర్నీ వరసగా నిలబెట్టి, ఒక్కక్కరినే చేత్తోతట్టి లెక్కబెట్టే సరికి 11మందీ లెక్కతేలే సరికి అంతా స్థిమిత పడ్డారు.

పరమానందయ్య శిష్యుల కథలు • Paramanandayya Sishyulu Stories In Telugu

  “Paramanandayya Shishyula Kathalu” is an Entertaining story. The main point of these stories is the lack of intelligenceBecause this ignorance contributes to the creation of great humor, We have brought you “Paramanandayya Sishyulu” stories in Telugu pdf font.

తెలుగులో  చిరకాలంగా ప్రచారంలో ఉన్న కథల మాలికలలో ఒకటి “పరమానందయ్య శిష్యుల కథలు” వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధానాంశం అతితెలివి తక్కువతనం అంతా శిష్యుల రూపంలో ఒకేచోట ప్రోగుకావడం!ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహద పడటం వల్లనే, ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే ‘వీడు పరమానందయ్య శిష్యుడిలా ఉన్నాడురా’ అనడం మనకు అనుభవంలో ఉన్నదే! 

Related Post

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.